శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 16 sloka 13 to 18
Sloka 13 to 15- ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు, "నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా ఉంటుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను శక్తిమంతుడను మరియు నేను సుఖంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు నా బంధువులు గొప్ప హోదాలో ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను (దేవతలకు) యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను." ఈ విధంగా, వారు అజ్ఞానముచే మోహితులై పోతారు.
Sloka 16-ఇటువంటి ఊహలు, తలపులతో తప్పుదారి పట్టి, మోహమనే వలలో చిక్కుకుపోయి, మరియు ఇంద్రియములను తృప్తి పరచటానికకే బానిసైపోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.
Sloka 17-ఇటువంటి స్వార్ధ-చింతనతో ఉన్న మూర్ఖపు మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.
Sloka 18-అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే కళ్ళుమూసుకు పోయి, ఈ అసురీ ప్రవృత్తి కలవారు, తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ/ద్వేషిస్తూ ఉంటారు.
To be continued...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.