Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 14 sloka 16 to 22

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 14 sloka 16 to 22
Sloka 16-సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణము లో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి.
Sloka 17-సత్త్వ గుణముచే జ్ఞానము, రజో గుణము చే లోభము(దురాశ), మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము (భ్రాంతి) జనించును.
Sloka 18-సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్య (లోకాల) లోనే ఉండిపోతారు; తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలైతారు.
Sloka 19-అన్ని పనులలో, చేసేది ఈ త్రి-గుణములే, ఇతర వేరే ఏవీ లేవు, అని ఎప్పుడైతే వివేవవంతులు తెలుసుకుంటారో, మరియు నేను వీటికి అతీతమైనవాడను అని తెలుసుకుంటారో - వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.
Sloka 20-దేహ సంబంధమయిన ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన, వ్యక్తి, జన్మ, వ్యాధి, మృత్యువు, వృద్ధాప్యముల దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు.
Sloka 21-అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవాడి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.