Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 2 sloka 25 to 30

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 25 to 30...
శ్రీ కృష్ణుడు పలికెను-
Sloka 25-ఆత్మ కు అంతం లేదు , మరీయు అనూహ్యమైన శాశ్వతమఐనది  , అందువలన  నీ కు ఈ బాధ అనవసరం.
Sloka 26- ఓ మహాబాహో! ఒకవేళ నీవీ ఆత్మ ( లేదా జీవలక్షణములు) ఎల్లప్పుడును పుట్టుచు, మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు.
Sloka 27-పుట్టినవానికి మరణము తప్పదు మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విధ్యుక్త ధర్మనిర్వహణము నందు నీవు దుఃఖింపారాదు. 
Sloka 28-సృజింపబడిన జీవులందరు ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందురు. అట్టి యెడ దుఃఖించుటకు అవసరమేమి కలదు?
Sloka 29-కొందరు ఆత్మను అధ్బుతమైనదానిగా గాంచుదురు. కొందరు దానిని అధ్బుతమైన దానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అధ్బుతమైనదానిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు. 
Sloka 30-ఓ భరతవంశీయుడా! దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖించుట తగదు. 
To be continued....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.