Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 2 Sloka 7 to 12

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 Sloka 7 to 12.....
Sloka 7- కార్పణ్యదోష కారణమున నేనిపుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయియితిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిపుడు నీకు శిష్యుడనుశిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. 
Sloka 8- ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకనును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యమువలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. 
Sloka 9- సంజయుడు పలికెను: శత్రువులను తపింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి, పిదప శ్రీకృష్ణునితో “ గోవిందా! నేను యుద్దమును చేయను” అని పలికి మౌనమును వహించెను.
Sloka 10-ఓ భరతవంశీయుడా! ఇరుసేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్నవాని వలె ఆ సమయమున దుఃఖితుడైన అర్జునునితో ఇట్లు పలికెను. 
Sloka 11-పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదాగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైనవారు జీవించియున్నవారిని గూర్చిగాని, మరణించినవారిని గూర్చిగాని దుఃఖింపరు.
Sloka 12-నేను గాని, నీవు గాని, ఈ రాజులందరు గాని నిలిచియుండని సమయమేదియును లేదు. అలాగుననే భవిష్యత్తు నందు మనమెవ్వరు ఉండకపోము. 
To be continued.....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.