Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 24 to 29...

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 24 to 29...
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 24-విధ్యుక్తధర్మమములను నేను నిర్వహింపనిచో లోకములన్నియును నాశామును పొందగలవు. అవాంఛనీయ ప్రజాబాహుళ్యమునకు నేను కారణుడనై తద్ద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరచినవాడనగుదును.
Sloka 25-పామరులు ఫలములను ఆసక్తిగలవారై తమ కర్మనొనరించునట్లు, విద్వాంసుడైన వాడు జనులను ధర్మమార్గమున వర్తింపజేయుటకై సంగరహితముగా కర్మ నొనరింపవలెను.
Sloka 26-విధ్యుక్తధర్మపు ఫలముల యెడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడురీతిగా విద్వాంసుడు వారిని కర్మ యందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తిభావముతో కర్మనొనరించును (కృష్ణభక్తి వృద్ది యగుటకు) వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలెను.
Sloka 27-మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును.
Sloka 28-ఓ మాహాబాహో! పరతత్త్వజ్ఞానము కలిగినవాడు భక్తియుతకర్మము మరియు కామ్యకర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి, ఇంద్రియములందును మరియు ఇంద్రియభోగములందును ఆసక్తుడు గాకుండును.
Sloka 29-ప్రకృతిగుణములచే మోహపరవశులైన మూఢులు భౌతికకర్మల యందు సంపూర్ణముగా నియుక్తులైన సంగత్వము నొందుదురు. కర్తయొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.