శ్రీ భగవద్ గీత తెలుగు లో-- Sri Bhagavad Gita telugu lo
Chapter 1 Slokas 16 to 24...
Sloka 16 to 18 ఓ రాజా! కుంతీపుత్రుడైన యుధిష్టిరుడు అనంతవిజయమనెడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనెడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనెడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టధ్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ధ్రౌపదీతనయులు, గొప్ప బాహువులు గలిగిన సుభాద్రాతనయుడు మున్నగు వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి.
Sloka 19- ఆ వివిధశంఖముల ధ్వని అతిభీకరమయ్యెను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయము బ్రద్దలు చేసెను.
Sloka 20-ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా! వ్యూహముగా నిలిచియున్నా ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణభగవానునితో ఈ వాక్యములను పలికెను.
Sloka 21-22- అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! దయచేసి రెండుసేనల నడుమ నా రథమును నిలుపుము. తద్ద్వార యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైనవారిని మరియు మాహాసంగ్రామమున నేను తలపడవలసినవారిని గాంచగలుగుదును.
Sloka 23-దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.
Sloka 24-సంజయుడు పలికెను : ఓ భరతవంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంభోదింపబడినవాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను.
To be continued....
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.