Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu loChapter 2 sloka 1 to 6....

శ్రీ భగవద్ గీత తెలుగు లో--Sri Bhagavad Gita telugu lo
Chapter 2 sloka 1 to 6....
సంజయుడు పలికెను: 
Sloka 1-చింతాక్రాంతుడై కనుల యందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జునిని గాంచిన మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) ఈ క్రింది వాక్యములను పలికెను. 
Sloka 2 - శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ అర్జునా! నీకీ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినది? జీవితపు వీలువ నెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు. పైగా అపకీర్తిని కలిగించును. 
Sloka 3- ఓ పృథాకుమారా! పతనకారక నపుంసకత్వమునకు లొంగకము. ఇది నీకు తగదు. ఓ పరంతపా! ఇట్టి హృదయదుర్బలతను విడినాడి వెంటనే లెమ్ము. 
Sloka 4-అర్జునుడు పలికెను: ఓ శత్రుసంహారా! ఓ మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణుల వంటివారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను?
Sloka 5-గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికి వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును. 
Sloka 6-వారిని జయించుట ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేమిక జీవించియుండుట వ్యర్థము. అయినప్పటికిని వారిపుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు. 
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.