Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 44 to 49

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 44 to 49..
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 44-భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై, వానిచే మొహపరవశులగు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్త సేవను గుర్చిన స్థిరనిశ్చయము కలుగనే కలుగదు. 
Sloka 45- వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా! నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై, ద్వంద్వముల నుండియు మరియు యోగక్షేమములనెడి చింతల నుండియు విడివడినవాడవై ఆత్మ యందు స్థిరుడవగుము.
Sloka 46-చిన్ననుతిచే ఒనగూడు ప్రయోజనములన్నియును శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలముచే సిద్ధించురీతి, వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. 
Sloka 47-విధ్యుక్తధర్మమును నిర్వర్తించుట యందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విధ్యుక్తధర్మమును వీడుట యందు ఆసక్తుడవు కాకుము.
Sloka 48-ఓ అర్జునా! జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విధ్యుక్తధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావానమే యోగామనబడును.
Sloka 49-ఓ ధనుంజయా! భక్తియోగముచే హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణువేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోభులు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.