Wednesday 22 April 2020

Sri Bhagavad Gita telugu lo..Chapter 1 sloka 32 to 38....

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo..
Chapter 1 sloka 32 to 38.....అర్జునుడు పలికెను....
ఓ గోవిందా! మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నమో వారందరును ఈ యుద్ధమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసుధనా! ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బందువులందరును తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా యెదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్ధనా! ఈ ధరాత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందము పొందగలము?
Sloka 36- ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణా! స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము?
Sloka 37-38- ఓ జనార్దనా! లోభపూర్ణ చిత్తము కలిగిన విరందరును కులసంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నాను, వంశనాశనము నందు దోషము గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులను కావలెను?
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.