Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo chapter 2 sloka 63 to 68

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 63 to 68
శ్రీ కృష్ణ భగవంతుడు పలికెను
Sloka 63-క్రోధమువలన అధికమోహము కలుగగా,మోహము వలన జ్ఞాపకశక్తి భ్రమకు గురియగును. జ్ఞాపకశక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధినశించినపుడు మనుజుడు   నాసెంచును   (తిరిగి సంసారగర్తమున పడిపోవును). 
Sloka 64-కాని సమస్త రాగద్వేషముల నుండి ముక్తిపొందినవాడును మరియు విధినియమముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగినవాడును అగు మనుజడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును.
Sloka 65-ఈ విధముగా కృష్ణభక్తిరసభావన యందు సంతృప్తి చెందినవానికి త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్త చిత్తము కలిగినపుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును.
Sloka 66-(కృష్ణభక్తిభావన యందు) భగవానునితో సంబంధమును పొందనివాడు విశుద్ధబుద్ధిని గాని, స్థిరమైన మనస్సును గాని కలిగియుండజాలడు. అవి లేనిదే శాంతిని పొందటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును?
Sloka 67-నీటి యందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి, మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చరించు ఇంద్రియములలో ఒక్కటైనను సరియే మనుజుని బుద్ధిని హరింపగలదు.
Sloka 68-అందుచే ఓ మాహాబాహో! ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడియుండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడనబడును. 
To be continued..

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.