శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 slokas 13 to 18...భగవాన్ విష్ణు అవతారం శ్రీ కృష్ణడు పలికెను.......
Sloka 13-దేహధారి దేహమునందు బాల్యము నుండి యౌవనమునకు, యౌవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చను రీతి మరణానంతరాము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయనున ధీరుడైనవాడు మోహము నొందడు.
Sloka 14-ఓ కౌంతేయా! తాత్కాలికములైనట్టి సుఖదుఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల వంటివి. ఓ భరతవంశీయుడా! ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనొందక సహించుట మనుజుడు నేర్వవలెను.
Sloka 15-ఓ మనవశ్రేష్టుడా(అర్జునా)! సుఖదుఃఖములచే కలత నొందక, ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై యున్నాడు.
Sloka 16-
అసత్తునకు(భౌతికదేహము) ఉనికి లేదనియు మరియు నిత్యమైనదానికి(ఆత్మ) మార్పు లేదనియు సత్యద్రష్టలైనవారు నిర్ణయించియున్నారు. ఈ రెండింటి తత్త్వమును బాగుగా అధ్యయనము చేసి వారీ విషయమున ధృవీకరించిరి.
Sloka 17-శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మా నశింపు లేనటువంటిదని నీవు తెలిసికొనుము. అట్టి అవినాశియైన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు.
Sloka 18- అవినాశియును, అపరిమితుడును, నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా! నీవు యుద్ధము చేయుము.
To be continued...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.