Wednesday 22 April 2020

Sri Bhagavad Gita Telugu lo..Chapter 1 slokas 25 to 31.......

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita Telugu lo..
Chapter 1 slokas 25 to 31.......
Sloka - 25 భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భుపలకుల సమక్షమున శ్రీకృష్ణుడు “ఓ పార్థా! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరిని గాంచుము” అని పలికెను. 
Sloka 26- ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
Sloka 27- నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను కూడినవాడ ఈ విధముగా పలికెను.
Sloka 28- శ్రీకృష్ణభగవానుని యెడ నిష్కపటమైన భక్తికలవాడెవడైనను దివ్యపురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త.
Sloka 29-నా దేహమంతయు కంపించుచున్నది. నాకు రోమాంచమగుచున్నది. గాండివధనుస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవు చున్నది.
Sloka 30- భాష్యమునేను ఇపుడు ఏ మాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నాన్ను. ఓ కృష్ణా! కేశిసంహారీ! కేవలము విపరీతములననే నేను గాంచుచున్నాను. 
Sloka 31-ఓ కృష్ణా! ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నను. 
To be continued.......

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.