Wednesday 22 April 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 1 sloka 39 to 4

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 1 sloka 39 to 46...అర్జునుడు పలికెను...
Sloka 39- కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు.
Sloka 40-ఓ కృష్ణా! వంశము నందు అధర్మము ప్రబలమగుట వలన కులస్త్రిలు చెడిపోవుదురు. ఓ వృష్ణివంశసంజాతుడా! అట్టి కులస్త్రి పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును.
Sloka 41-అవాంచిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితురులు పతనము నొందుదురు.
Sloka 42-వంశాచారమును నశింపజేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతిధర్మములు నాశనమగును. 
Sloka 43- ఓ కృష్ణా! జనార్దనా! కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని.
Sloka 44-అహో! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించవలెననెడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము. 
Sloka 45- నిరాయుధుడు మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.
Sloka 46-సంజయుడు పలికెను: రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్భాణములను పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను.
To be continued...with 2nd chapter....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.