Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 17 to 23

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 17 to 23
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 17-కాని ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మ యందే ఆనందమును గొనుచు, ఆత్మ యందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందినవానికి చేయవలసిన కర్మమేమియును లేదు.
Sloka 18-ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విధ్యుక్తధర్మనిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదియును ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని, ఇతర జీవులపై అధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు.
Sloka 19-కనుక ప్రతియొక్కరు కర్మఫలముల యందు ఆసక్తిని గొనక తన విధియని భావించుచు కర్మల యందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మ నొనరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు.
Sloka 20-జనకమాహారాజు వంటి రాజులు కేవలము విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిరి. కావున జనసామాన్యమునకు భోదించు నిమిత్తమై తప్పక నీవు కర్మను చేయుము.
Sloka 21-మహానియుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును.
Sloka 22-ఓ పార్థా! నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదియును లేదు. నేను కోరునది కాని, పొందవలసిన కాని ఏదియును లేకున్నను విహితకర్మల యందు నేను నియుక్తుడనై యున్నాను.
Sloka 23-ఓ పార్థా! ఒకవేళ నేను విధ్యుక్తధర్మమములను శ్రద్ధగా నిర్వహింపనిచో మనుజులు తప్పక నా మార్గమునే అనుసరింతురు.
To be continued....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.