Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 2 slokas 50 to 55

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
శ్రీ కృష్ణుడు పలికెను
Chapter 2 slokas 50 to 55
Sloka 50-భక్తియోగమందు నియుక్తుడైనవాడు ఈ జన్మమందే శుభాశుభఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మ యందలి నేర్పుయైనటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. 
Sloka 51-ఆ విధముగా భక్తియోగమునందు నియుక్తులైన మహర్షులు లేదా భక్తులు ఈ భౌతికజగమునందు కర్మఫలముల నునుద్ తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన,మరణచక్రము నుండి విడుదలను పొంది (భగవద్దామమును చేరుట ద్వారా) దుఃఖరాహిత్యస్థితిని పొందుచున్నారు. 
Sloka 52-ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మొహారణ్యమును దదాటునో అప్పుడు నీవు వినినదాని యెడ మరియు వినవలసినదాని యెడ విరక్తిని కలిగినవాడవగుదువు. 
Sloka 53-ఎప్పుడు నీ మనస్సు వేదముల మధురవాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి యనెడి సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్యచైతన్యమును పొందినవాడగుదువు. 
Sloka 54-అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షనము లేవి? అతడు ఏ విధముగా భాషించును, అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును, ఎట్లు నడుచును?
Sloka 55-శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆవిధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మ యందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. 
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.