Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 56 to 61

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 56 to 61
శ్రీకృష్ణభగవానుడు పలికెను
Sloka 56-త్రివిధ తాపములందును చలింపని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడును, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సుగల ముని యని చెప్పబడును.
Sloka 57- భౌతికజగమునందు ప్రాప్తించిన మంచి, చెడులను ప్రశంసించుట గాని, ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణజ్ఞానమునందు స్థిరుడై నిలుచును.
Sloka 58-తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనెడి రీతి, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణమునందు స్థిరముగా నున్నవాడును.
Sloka 59-దేహిని ఇంద్రియభోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే యుండును. కాని అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలుడు.
Sloka 60-ఓ అర్జునా! ఇంద్రియములు బలవంతములను మరియు దృడములును అయియున్నవి. వానిని అదుపు చేయు యత్నించు విచక్షణాపూర్ణుని మనస్సును సైతము అవి హరించివేయుచున్నవి.
Sloka 61-ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశము నందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును.
Sloka 62- ఇంద్రియార్థములను ధ్యానించునపుడు వాని యెడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధినొందగా, కామము నుండి క్రోధము ఉద్భవించును.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.