శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 1 to 7
sloka 1- అర్జునుడు పలికెను : ఓ జనార్దానా, ఓ కేశవ , ఫలవంతమైన పని కంటే తెలివితేటలు మంచివని మీరు చెప్పారు, మరి ఇపుడు ఈ భయంకరమైన యుద్ధంలో నన్ను ఎందుకు నిమగ్నం చేయాలనుకుంటున్నారు?
Sloka 2-అనేకార్థములు కలిగిన నీ భోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయుము.
Sloka 3-దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను: పాపరహితుడవైన ఓ అర్జునా! ఆత్మానుభూతిని పొందగోరు మానవుల రెండురకములని ఇదివరకే నేను వివిరించితివి. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసికొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అర్థము చేసికొనగోరుదురు.
Sloka 4- కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్న్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు.
Sloka 5-ప్రతిమానవుడు భౌతికప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము ననుసరించి అవశుడై కర్మ యందు ప్రేరేపింపబడును. కావున ఏదియును చేయకుండ క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు.
Sloka 6-కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి యనబడును.
Sloka 7-అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుట యత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును (కృష్ణభక్తిరసభావన యందు) ఆరంభించు శ్రద్దావంతుడు అత్యుత్తముడు.
To be continued.....
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.