Friday, 24 April 2020

Sri Bhagavad Gita telugu loChapter 2 sloka 1 to 6....

శ్రీ భగవద్ గీత తెలుగు లో--Sri Bhagavad Gita telugu lo
Chapter 2 sloka 1 to 6....
సంజయుడు పలికెను: 
Sloka 1-చింతాక్రాంతుడై కనుల యందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జునిని గాంచిన మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) ఈ క్రింది వాక్యములను పలికెను. 
Sloka 2 - శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ అర్జునా! నీకీ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినది? జీవితపు వీలువ నెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు. పైగా అపకీర్తిని కలిగించును. 
Sloka 3- ఓ పృథాకుమారా! పతనకారక నపుంసకత్వమునకు లొంగకము. ఇది నీకు తగదు. ఓ పరంతపా! ఇట్టి హృదయదుర్బలతను విడినాడి వెంటనే లెమ్ము. 
Sloka 4-అర్జునుడు పలికెను: ఓ శత్రుసంహారా! ఓ మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణుల వంటివారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను?
Sloka 5-గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికి వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును. 
Sloka 6-వారిని జయించుట ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేమిక జీవించియుండుట వ్యర్థము. అయినప్పటికిని వారిపుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు. 
To be continued...

Wednesday, 22 April 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 1 sloka 39 to 4

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 1 sloka 39 to 46...అర్జునుడు పలికెను...
Sloka 39- కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు.
Sloka 40-ఓ కృష్ణా! వంశము నందు అధర్మము ప్రబలమగుట వలన కులస్త్రిలు చెడిపోవుదురు. ఓ వృష్ణివంశసంజాతుడా! అట్టి కులస్త్రి పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును.
Sloka 41-అవాంచిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితురులు పతనము నొందుదురు.
Sloka 42-వంశాచారమును నశింపజేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతిధర్మములు నాశనమగును. 
Sloka 43- ఓ కృష్ణా! జనార్దనా! కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని.
Sloka 44-అహో! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించవలెననెడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము. 
Sloka 45- నిరాయుధుడు మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.
Sloka 46-సంజయుడు పలికెను: రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్భాణములను పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను.
To be continued...with 2nd chapter....

Sri Bhagavad Gita telugu lo..Chapter 1 sloka 32 to 38....

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo..
Chapter 1 sloka 32 to 38.....అర్జునుడు పలికెను....
ఓ గోవిందా! మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నమో వారందరును ఈ యుద్ధమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసుధనా! ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బందువులందరును తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా యెదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్ధనా! ఈ ధరాత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందము పొందగలము?
Sloka 36- ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణా! స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము?
Sloka 37-38- ఓ జనార్దనా! లోభపూర్ణ చిత్తము కలిగిన విరందరును కులసంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నాను, వంశనాశనము నందు దోషము గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులను కావలెను?
To be continued...

Sri Bhagavad Gita Telugu lo..Chapter 1 slokas 25 to 31.......

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita Telugu lo..
Chapter 1 slokas 25 to 31.......
Sloka - 25 భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భుపలకుల సమక్షమున శ్రీకృష్ణుడు “ఓ పార్థా! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరిని గాంచుము” అని పలికెను. 
Sloka 26- ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
Sloka 27- నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను కూడినవాడ ఈ విధముగా పలికెను.
Sloka 28- శ్రీకృష్ణభగవానుని యెడ నిష్కపటమైన భక్తికలవాడెవడైనను దివ్యపురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త.
Sloka 29-నా దేహమంతయు కంపించుచున్నది. నాకు రోమాంచమగుచున్నది. గాండివధనుస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవు చున్నది.
Sloka 30- భాష్యమునేను ఇపుడు ఏ మాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నాన్ను. ఓ కృష్ణా! కేశిసంహారీ! కేవలము విపరీతములననే నేను గాంచుచున్నాను. 
Sloka 31-ఓ కృష్ణా! ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నను. 
To be continued.......

Sri Bhagavad Gita telugu lo Chapter 1 Slokas 16 to 24...

శ్రీ భగవద్ గీత తెలుగు లో-- Sri Bhagavad Gita telugu lo 
Chapter 1 Slokas 16 to 24...
Sloka 16 to 18 ఓ రాజా! కుంతీపుత్రుడైన యుధిష్టిరుడు అనంతవిజయమనెడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనెడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనెడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టధ్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ధ్రౌపదీతనయులు, గొప్ప బాహువులు గలిగిన సుభాద్రాతనయుడు మున్నగు వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి. 
Sloka 19- ఆ వివిధశంఖముల ధ్వని అతిభీకరమయ్యెను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయము బ్రద్దలు చేసెను.
Sloka 20-ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా! వ్యూహముగా నిలిచియున్నా ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణభగవానునితో ఈ వాక్యములను పలికెను.
Sloka 21-22- అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! దయచేసి రెండుసేనల నడుమ నా రథమును నిలుపుము. తద్ద్వార యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైనవారిని మరియు మాహాసంగ్రామమున నేను తలపడవలసినవారిని గాంచగలుగుదును.
Sloka 23-దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.
Sloka 24-సంజయుడు పలికెను : ఓ భరతవంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంభోదింపబడినవాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను.
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 1 slokas 9 to 15....

శ్రీ భగవద్ గీత తెలుగు లో... Sri Bhagavad Gita telugu lo 
Chapter 1 slokas 9 to 15....
Chapter 1 sloka 9- నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలువిధములైన ఆయుధములను దాల్చినవారు మరియు యుద్ధనిపుణతను కలిగినవారును అయియున్నారు. 
Sloka 10-మన సైన్యబలము లెక్కింప విలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవసైన్యము పరిమితముగా నున్నది.
Sloka 11-సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది.
Sloka 12-అప్పుడు కురువృద్దుడును, యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరముగా పూరించెను.
Sloka 13-అటుపిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నియు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతిభీకరముగా నుండెను. 
Sloka 14-ఎదుటి పక్షమున శ్రీకృష్ణభగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుఱ్ఱములు పూన్చబడిన మహారథమునందు ఆసీనులైనవారై తమ దివ్యశంఖములను పురించిరి. 
Sloka 15-శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను; భోజనప్రియుడు, ఘన కార్యములను చేయువాడు అగు భీముడు పౌండ్రమనెడి తన మాహాశంఖము నూదెను.
To be continued...

Sri Bhagavad Gita Telugu loChapter 1 sloka 1 to 8

శ్రీ భగవద్ గీత తెలుగు లో-- Sri Bhagavad Gita Telugu lo
Chapter 1 sloka 1 to 8............
Chapter 1  sloka 1- ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
Sloka 2 - సంజయుడు పలికెను: ఓ రాజా! పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను.
Sloka 3- ఓ ఆచార్యా! మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపదతనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము.
Sloka 4 - ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు.
Sloka 5- ధృష్ట కేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోదులును అందున్నారు.
Sloka 6- పరాక్రమవంతులైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపదికుమారులును అందున్నారు. ఈ వీరులందరును మహారథులు.
Sloka 7- కాని ఓ బ్రాహ్మణోత్తమా! నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను.
Sloka 8- యుద్దమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు,భీష్ముడు, కర్ణుడు,కృపుడు, అశ్వత్థామ,వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు.
To be continued...