Friday, 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 11 to 16

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 11 to 16
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 11-యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును గూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు. 
Sloka 12-వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నియును ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును. 
Sloka 13-యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవధ్భక్తులు సర్వవిధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసికొనువారు కేవలము పాపమునే భుజింతురు.
Sloka 14-జీవదేహములన్నియును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధ్యానములపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా, విహితకర్మము నుండి యజ్ఞము ఉద్బవించుచున్నది.
Sloka 15-నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపపడగా, అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్టితమై యుండును.
Sloka 16-ఓ అర్జునా! ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞచక్రమును జీవితమున అనుసరింపనివాడు నిక్కముగా పాపజీవనుడగును. కేవలము ఇంద్రియతృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనము గడుపును. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 8 to 10

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 8 to 10
శ్రీ కృష్ణుడు పలికెను  
Sloka 8-నీ విధ్యుక్తధర్మమును నీవు నిర్వర్తింపుము. ఏలయన అది అకర్మ కన్నను ఉత్తమమైనది. కర్మ నొనరింపకుండా దేహపోషణము సైతము మనుజుడు చేసికొనజాలడు.
Sloka 9-విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతికజగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతీపుత్రా! నీ విధ్యుక్తధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. 
Sloka 10-సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులకు మరియు దేవతలకు విష్ణుప్రీత్యర్థమైన యజ్నములతో సహా సృష్టించి “ ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు. ఏలయన వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును ఒసంగును” అని ఆశీర్వదించెను.
PURPORT:-
సర్వజీవుల ప్రభువైన విష్ణువుచే సృష్టింపబడిన భౌతికజగత్తు బద్ధజీవులు భగవద్దామము తిరిగి చేరుటకు ఒసగాబడిన ఒక అవకాశము వంటిది. దేవదేవుడైన శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే ఈ జగమునందు జీవులందరును భౌతికప్రకృతిచే బద్దులగుచున్నారు. అట్టి నిత్యసంబంధమును జీవులు తెలిసికొనుటకు వేదము సహాయపడును. “వేదైశ్చ సర్వైరహమేవవేద్య:” అని ఈ విషయమునే భగవద్గీత తెలియజేయుచున్నది. తన నెరుగుటయే వేదముల ఉద్దేశ్యమని శ్రీకృష్ణభగవానుడు తెలిపియున్నాడు. “పతిం విశ్వస్యాత్మేశ్వరం” అని వేదంమంత్రములందు తెలుపబడినది. అనగా జీవులకు ప్రభువు దేవదేవుడైన విష్ణువు.
To be continued

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 1 to 7
 sloka 1-    అర్జునుడు పలికెను     : ఓ జనార్దానా,  ఓ కేశవ       , ఫలవంతమైన పని కంటే తెలివితేటలు మంచివని మీరు చెప్పారు,     మరి ఇపుడు   ఈ భయంకరమైన యుద్ధంలో నన్ను ఎందుకు నిమగ్నం చేయాలనుకుంటున్నారు?
Sloka 2-అనేకార్థములు కలిగిన నీ భోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయుము.
Sloka 3-దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను: పాపరహితుడవైన ఓ అర్జునా! ఆత్మానుభూతిని పొందగోరు మానవుల రెండురకములని ఇదివరకే నేను వివిరించితివి. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసికొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అర్థము చేసికొనగోరుదురు.
Sloka 4- కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్న్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు.
Sloka 5-ప్రతిమానవుడు భౌతికప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము ననుసరించి అవశుడై కర్మ యందు ప్రేరేపింపబడును. కావున ఏదియును చేయకుండ క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు. 
Sloka 6-కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి యనబడును.
Sloka 7-అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుట యత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును (కృష్ణభక్తిరసభావన యందు) ఆరంభించు శ్రద్దావంతుడు అత్యుత్తముడు.
To be continued.....

Sri Bhagavad Gita telugu lo chapter 2 sloka 69 to 72

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo..
శ్రీ కృష్ణ భగవంతుడు పలికెను
Chapter 2 sloka 69 to 72
Sloka 69-సకలజీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. 
Sloka 70-సదా సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి, తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహములే కలత నొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు.
Sloka 71-ఇంద్రియభోగానుభవ కోరికల నన్నింటిని త్యజించి నిష్కామునిగా జీవించుచు, మమకారము మరియు మిథ్యాహంకారము వదిలిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును.
Sloka 72- ఇదియే అధ్యాత్మికమును, దివ్యమును అయిన జీవనవిధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహము నొందడు. మరణసమయమునందును ఆ విధముగా స్థితుడైనవట్టివాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును.
 
Summery- Leave material world and attain moksha, so do Karma with out attachment. Leave results to God VISHNU.
కృష్ణభక్తిభావనము (ఆధ్యాత్మిక జీవనము) మనుజడు క్షణములో పొందవచ్చును లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేక పోవచ్చును. ఇది కేవలము తత్త్వము యొక్క అవగాహన మరియు అంగీకకారముపైననే ఆధారపడి యున్నది. కృష్ణునకు శరణము నొందుట ద్వారా ఖట్వాంగమహారాజు మరణమునకు కొలది నిమిషమునకు ముందే అట్టి జీవనస్థితి పొందగలిగెను. వాస్తవమునకు విషయపూర్ణ జీవనమునకు material life ముగించుటయే నిర్వాణము.  నిజమైన జీవితము భౌతికజీవితపు అంతము పిమ్మట ఆరంభమగుచున్నది.
To be continued with 3rd chapter....

Sri Bhagavad Gita telugu lo chapter 2 sloka 63 to 68

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 63 to 68
శ్రీ కృష్ణ భగవంతుడు పలికెను
Sloka 63-క్రోధమువలన అధికమోహము కలుగగా,మోహము వలన జ్ఞాపకశక్తి భ్రమకు గురియగును. జ్ఞాపకశక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధినశించినపుడు మనుజుడు   నాసెంచును   (తిరిగి సంసారగర్తమున పడిపోవును). 
Sloka 64-కాని సమస్త రాగద్వేషముల నుండి ముక్తిపొందినవాడును మరియు విధినియమముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగినవాడును అగు మనుజడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును.
Sloka 65-ఈ విధముగా కృష్ణభక్తిరసభావన యందు సంతృప్తి చెందినవానికి త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్త చిత్తము కలిగినపుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును.
Sloka 66-(కృష్ణభక్తిభావన యందు) భగవానునితో సంబంధమును పొందనివాడు విశుద్ధబుద్ధిని గాని, స్థిరమైన మనస్సును గాని కలిగియుండజాలడు. అవి లేనిదే శాంతిని పొందటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును?
Sloka 67-నీటి యందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి, మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చరించు ఇంద్రియములలో ఒక్కటైనను సరియే మనుజుని బుద్ధిని హరింపగలదు.
Sloka 68-అందుచే ఓ మాహాబాహో! ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడియుండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడనబడును. 
To be continued..

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 56 to 61

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 56 to 61
శ్రీకృష్ణభగవానుడు పలికెను
Sloka 56-త్రివిధ తాపములందును చలింపని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడును, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సుగల ముని యని చెప్పబడును.
Sloka 57- భౌతికజగమునందు ప్రాప్తించిన మంచి, చెడులను ప్రశంసించుట గాని, ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణజ్ఞానమునందు స్థిరుడై నిలుచును.
Sloka 58-తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనెడి రీతి, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణమునందు స్థిరముగా నున్నవాడును.
Sloka 59-దేహిని ఇంద్రియభోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే యుండును. కాని అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలుడు.
Sloka 60-ఓ అర్జునా! ఇంద్రియములు బలవంతములను మరియు దృడములును అయియున్నవి. వానిని అదుపు చేయు యత్నించు విచక్షణాపూర్ణుని మనస్సును సైతము అవి హరించివేయుచున్నవి.
Sloka 61-ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశము నందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును.
Sloka 62- ఇంద్రియార్థములను ధ్యానించునపుడు వాని యెడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధినొందగా, కామము నుండి క్రోధము ఉద్భవించును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 2 slokas 50 to 55

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
శ్రీ కృష్ణుడు పలికెను
Chapter 2 slokas 50 to 55
Sloka 50-భక్తియోగమందు నియుక్తుడైనవాడు ఈ జన్మమందే శుభాశుభఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మ యందలి నేర్పుయైనటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. 
Sloka 51-ఆ విధముగా భక్తియోగమునందు నియుక్తులైన మహర్షులు లేదా భక్తులు ఈ భౌతికజగమునందు కర్మఫలముల నునుద్ తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన,మరణచక్రము నుండి విడుదలను పొంది (భగవద్దామమును చేరుట ద్వారా) దుఃఖరాహిత్యస్థితిని పొందుచున్నారు. 
Sloka 52-ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మొహారణ్యమును దదాటునో అప్పుడు నీవు వినినదాని యెడ మరియు వినవలసినదాని యెడ విరక్తిని కలిగినవాడవగుదువు. 
Sloka 53-ఎప్పుడు నీ మనస్సు వేదముల మధురవాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి యనెడి సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్యచైతన్యమును పొందినవాడగుదువు. 
Sloka 54-అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షనము లేవి? అతడు ఏ విధముగా భాషించును, అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును, ఎట్లు నడుచును?
Sloka 55-శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆవిధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మ యందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. 
To be continued...