Friday, 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 44 to 49

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 44 to 49..
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 44-భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై, వానిచే మొహపరవశులగు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్త సేవను గుర్చిన స్థిరనిశ్చయము కలుగనే కలుగదు. 
Sloka 45- వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా! నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై, ద్వంద్వముల నుండియు మరియు యోగక్షేమములనెడి చింతల నుండియు విడివడినవాడవై ఆత్మ యందు స్థిరుడవగుము.
Sloka 46-చిన్ననుతిచే ఒనగూడు ప్రయోజనములన్నియును శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలముచే సిద్ధించురీతి, వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. 
Sloka 47-విధ్యుక్తధర్మమును నిర్వర్తించుట యందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విధ్యుక్తధర్మమును వీడుట యందు ఆసక్తుడవు కాకుము.
Sloka 48-ఓ అర్జునా! జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విధ్యుక్తధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావానమే యోగామనబడును.
Sloka 49-ఓ ధనుంజయా! భక్తియోగముచే హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణువేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోభులు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 37 to 43

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 37 to 43...
శ్రీ కృష్ణుడు పలికెను 
Sloka 37-ఓ కుంతీ తనయా! నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుతటయో లేక యుద్దమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృతనిశ్చయుడవై లేచి యుద్ధము చేయుము. 
Sloka 38-సుఖదు:ఖములను గాని, లాభాలాభములను గాని, జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయము.
 ఆ విధముగా చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు.
Sloka 39- ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ననుసరించి నీకు వివరించితిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమున వివరించెదను ఆలకింపుము. ఓ పృథాకుమారా! అట్టి జ్ఞానము ననుసరించి నీవు వర్తింతువేని కర్మబంధము నుండి విడివడగలవు.
Sloka  40-ఈ ప్రయత్నము నందు నష్టము గాని, హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్పపురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును. 
Sloka 41-ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును. 
Sloka 42-43 స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము,అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు. 
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 31 to 36

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 31 to 36...
శ్రీ కృష్ణ భగవంతుడు పలికెను
Sloka 31 -క్షత్రియునిగా స్వధర్మము ననుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరోక్కటి లేదని నివెరుగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు. 
Sloka 32-ఓ పార్థా! స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్దావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు.
Sloka 33- చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచి నందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడవనెడి కీర్తిని నీవు పోగొట్టుకొందువు. 
Sloka 34-జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడును చెప్పుకొనుదురు. గౌరవనీయుడైనవానికి అపకీర్తి యనునది మరణము కన్నను దారుణదారుణమైనది. 
Sloka 35-నీ పేరు ప్రతిష్టల యెడ గొప్ప గౌరవమును కలిగియున్న సేనాదిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడినావని తలచి నిన్ను చులకన చేయుదురు. 
Sloka 36- శత్రువులు నిన్ను పలు నిర్దయవాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకన్నను నీకు దుఃఖకరమైనది వేరేది గలదు?
To be continued....

Sri Bhagavad Gita telugu lo...Chapter 2 sloka 25 to 30

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 25 to 30...
శ్రీ కృష్ణుడు పలికెను-
Sloka 25-ఆత్మ కు అంతం లేదు , మరీయు అనూహ్యమైన శాశ్వతమఐనది  , అందువలన  నీ కు ఈ బాధ అనవసరం.
Sloka 26- ఓ మహాబాహో! ఒకవేళ నీవీ ఆత్మ ( లేదా జీవలక్షణములు) ఎల్లప్పుడును పుట్టుచు, మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు.
Sloka 27-పుట్టినవానికి మరణము తప్పదు మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విధ్యుక్త ధర్మనిర్వహణము నందు నీవు దుఃఖింపారాదు. 
Sloka 28-సృజింపబడిన జీవులందరు ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందురు. అట్టి యెడ దుఃఖించుటకు అవసరమేమి కలదు?
Sloka 29-కొందరు ఆత్మను అధ్బుతమైనదానిగా గాంచుదురు. కొందరు దానిని అధ్బుతమైన దానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అధ్బుతమైనదానిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు. 
Sloka 30-ఓ భరతవంశీయుడా! దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖించుట తగదు. 
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 19 to 24

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 19 to 24....
శ్రీ కృష్ణుడు పలికెను- Sloka 19-జీవుడు చంపువాడని తలచువాడు గాని, చంపబడువాడని భావించువాడు గాని జ్ఞానవంతులు కారు. ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు. 
Sloka 20-ఆత్మకు ఎన్నడును జన్మగాని, మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. జన్మరహితమును, నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు.
Sloka 21-ఓ పార్థా! ఆత్మ నాశము లేనిదనియు, నిత్యమైనదనియు, పుట్టుకలేనిదనియు, అవ్యయమైనదనియు తెలిసినవాడు ఎవ్వరినేని ఎట్లు చంపును? లేదా చంపించును?
Sloka 22-మనుజుడు పాతవస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి, ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది.
Sloka 23-ఆత్మ యేటి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే శోషింపబడదు.
Sloka 24-ఆత్మ ఛేదింపబడనటువంటి మరియు కరుగునటువంటిది. దహింపజేయుటకు గాని, శోషింపజేయుటకు గాని అది వీలుకానటువంటిది. అది నిత్యమును, సర్వత్రా వ్యాపితమును,మార్పురహితమును, అచలమును, సనాతనము అయియున్నది. 
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 2 slokas 13 to 18

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 slokas 13 to 18...భగవాన్ విష్ణు అవతారం శ్రీ కృష్ణడు పలికెను.......
Sloka 13-దేహధారి దేహమునందు బాల్యము నుండి యౌవనమునకు, యౌవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చను రీతి మరణానంతరాము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయనున ధీరుడైనవాడు మోహము నొందడు. 
Sloka 14-ఓ కౌంతేయా! తాత్కాలికములైనట్టి సుఖదుఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల వంటివి. ఓ భరతవంశీయుడా! ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనొందక సహించుట మనుజుడు నేర్వవలెను.
Sloka 15-ఓ మనవశ్రేష్టుడా(అర్జునా)! సుఖదుఃఖములచే కలత నొందక, ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై యున్నాడు. 
Sloka 16-
అసత్తునకు(భౌతికదేహము) ఉనికి లేదనియు మరియు నిత్యమైనదానికి(ఆత్మ) మార్పు లేదనియు సత్యద్రష్టలైనవారు నిర్ణయించియున్నారు. ఈ రెండింటి తత్త్వమును బాగుగా అధ్యయనము చేసి వారీ విషయమున ధృవీకరించిరి. 
Sloka 17-శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మా నశింపు లేనటువంటిదని నీవు తెలిసికొనుము. అట్టి అవినాశియైన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. 
Sloka 18- అవినాశియును, అపరిమితుడును, నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా! నీవు యుద్ధము చేయుము. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 2 Sloka 7 to 12

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 Sloka 7 to 12.....
Sloka 7- కార్పణ్యదోష కారణమున నేనిపుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయియితిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిపుడు నీకు శిష్యుడనుశిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. 
Sloka 8- ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకనును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యమువలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. 
Sloka 9- సంజయుడు పలికెను: శత్రువులను తపింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి, పిదప శ్రీకృష్ణునితో “ గోవిందా! నేను యుద్దమును చేయను” అని పలికి మౌనమును వహించెను.
Sloka 10-ఓ భరతవంశీయుడా! ఇరుసేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్నవాని వలె ఆ సమయమున దుఃఖితుడైన అర్జునునితో ఇట్లు పలికెను. 
Sloka 11-పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదాగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైనవారు జీవించియున్నవారిని గూర్చిగాని, మరణించినవారిని గూర్చిగాని దుఃఖింపరు.
Sloka 12-నేను గాని, నీవు గాని, ఈ రాజులందరు గాని నిలిచియుండని సమయమేదియును లేదు. అలాగుననే భవిష్యత్తు నందు మనమెవ్వరు ఉండకపోము. 
To be continued.....